Home » New Delhi
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.
మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గంగా లోక్సభ శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. సభ నిరవధిక వాయిదాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన లోక్సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారంనాడు పార్లమెంటుకు బయలుదేరుతుండగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రహదారిపై ఓ స్టూటిరిస్టు కింద పడిపోవడంతో రాహుల్ కారు ఆపి ఆయనను లేవదీశారు. అనంతరం పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు.
వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో జార్ఖాండ్, త్రిపుర, కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.